విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- May 03, 2026
చెన్నై: షార్జా నుండి చెన్నై చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. విమానం ల్యాండ్ అయి రన్వే నుంచి పార్కింగ్ ఏరియాకు కదులుతున్న సమయంలో, పుదుక్కోట్టైకి చెందిన ఒక ప్రయాణికుడు ఊహించని విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచి బయటకు దూకేశాడు.
ఈ చర్యను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తం చేయడంతో CISF సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వెల్లడైంది. ప్రయాణంలో రెండు సార్లు వాంతులు చేసుకున్న అతడు, విమానం ఆగిన వెంటనే బయటపడటానికి కంగారులో డోర్ తెరిచి దూకేసినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ ఘటన కారణంగా భద్రతా కారణ దృష్ట్యా ప్రధాన రన్వేను ఒక గంట పాటు మూసివేసి, విమానాలను ప్రత్యామ్నాయ రన్వేకు మళ్లించారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







