ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- May 03, 2026
మస్కట్: వేసవి కాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేతలను నివారించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు, గృహ వినియోగదారులకు విద్యుత్ టారిఫ్లను పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ అథారిటీ (APSR) తగ్గించనుంది. వినియోగదారులకు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నది.
పెరుగుతున్న వేడి కారణంగా విద్యుత్ వినియోగం పెరగడం వల్ల కలిగే ప్రభావాన్ని ఎదుర్కోవడమే ఈ చర్య లక్ష్యమని అథారిటీ తెలిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు నెల వరకు అమలులో ఉంటాయయన్నారు .
అలాగే, ఈ కాలంలో గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయబోమని, అధిక వినియోగాన్ని నిర్వహించుకోవడానికి సౌకర్యవంతమైన బిల్లు చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవాలని వినియోగదారులను ప్రోత్సహిస్తున్నామని కూడా APSR తెలిపింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







