జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- May 03, 2026
కువైట్: జాయింట్ ఆటోమేటెడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ కంపెనీ KNET జూన్ 5 నుండి అమలులోకి వచ్చేలా తన ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వేకు ఒక అప్డేట్ను ప్రకటించింది.
ఈ కొత్త అప్డేట్ ప్రకారం, వినియోగదారులు మెనూ నుండి తమ బ్యాంకును ఎంచుకోవాల్సిన అవసరం లేకుండా, తమ బ్యాంక్ కార్డ్ నంబర్ను నేరుగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది పేమెంట్ ప్రక్రియను సులభతరం చేసి, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.
డిజిటల్ చెల్లింపులలో ప్రపంచవ్యాప్త పురోగతికి అనుగుణంగా ఉండటమే ఈ మార్పు లక్ష్యమని KNET పేర్కొంది. ఇది భవిష్యత్తులో అదనపు చెల్లింపు పద్ధతులను అనుసంధానించడానికి కూడా వీలు కల్పిస్తుంది. తద్వారా తన ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను విస్తరించడం మరియు మెరుగుపరచడం అనే కంపెనీ విస్తృత లక్ష్యానికి మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
డిజిటల్ మరియు ఆర్థిక సేవలలోని వివిధ రంగాలలో సరికొత్త సాంకేతికతలను ఉపయోగించుకుంటూ KNET అన్ని కువైట్ బ్యాంకులకు ఆటోమేటెడ్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుందని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







