జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- May 05, 2026
కువైట్: జనరల్ ట్రాఫిక్ విభాగం సహకారంతో ప్రజా పనుల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న రోడ్డు పనుల నేపథ్యంలో జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్డుపై తాత్కాలిక పాక్షిక మూసివేతను ప్రకటించింది.
ఈ మూసివేత ఖుర్తుబా ప్రాంతానికి ఎదురుగా ఉన్న మూడు కుడి లేన్లను ప్రభావితం చేస్తుందని, ఇది సుమారు 500 మీటర్ల మేర విస్తరించి ఉందని పేర్కొన్నది. ఇది ట్రాఫిక్ ఆంక్షులు ఈనెల 16 వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
కాగా, పనులు జరుగుతున్న సమయంలో మూడు లేన్లు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటాయని అధికారులు ధృవీకరించారు. కింగ్ ఫైసల్ రోడ్డుకు వెళ్లే నిష్క్రమణ మార్గం కూడా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో అల్-సుర్రా మరియు డమాస్కస్/ఖుర్తుబా వీధి నుండి జహ్రా వైపు వెళ్లే వాహనదారుల కోసం సమాంతర సర్వీస్ రోడ్డు తెరిచి ఉంటుందని తెలిపారు.
ఆ ప్రాంతంలో భద్రత, సులభమైన ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి రహదారి వినియోగదారులు జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







