విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!

- May 06, 2026 , by Maagulf
విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!

కువైట్ః భారత విమానయాన సంస్థలు విమాన సర్వీసులను త్వరగా పునఃప్రారంభించడంపై భారత్, కువైట్ చర్చలు జరిపాయి. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధ్యక్షుడు హెచ్.ఇ. షేక్ హమూద్ ముబారక్ హమూద్ అల్-సబాతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విమానయాన రంగంలో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను తెలియజేశాయి. కువైట్ నుండి భారతీయ విమానయాన సంస్థల విమాన కార్యకలాపాలను త్వరగా పునఃప్రారంభించేందుకు వీలు కల్పించడంపై కూడా వారు చర్చించారు.

కువైట్‌లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ ప్రవాస సమాజానికి ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు మరింత సౌకర్యాన్ని కల్పించడంపై ఈ చర్చలు కొనసాగాయి. భారత్-కువైట్ మధ్య మెరుగైన విమానయాన ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి మరియు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి మరింత సహకారంపై ఇరు దేశాల అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com