యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- May 06, 2026
మనామాః ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ లో యుద్ధంతోపాటు మిడిలీస్టులో ఉద్రిక్తతలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా , ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు కింగ్ హమద్ మనామాలో జెలెన్స్కీకి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రిన్స్, ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు.
ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను వారు సమీక్షించారు. ఇటీవల ఇరాన్, బహ్రెయిన్ మరియు ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాలపై జరిపిన దాడుల నేపథ్యంలో జెలెన్స్కీ బహ్రెయిన్కు చూపిన సంఘీభావానికి కింగ్ హమద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉక్రెయిన్లో సుస్థిర శాంతిని సాధించేందుకు చర్చలు, దౌత్యనీతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు బహ్రెయిన్ మద్దతుగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









