యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- May 06, 2026
మనామాః ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ లో యుద్ధంతోపాటు మిడిలీస్టులో ఉద్రిక్తతలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా , ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు కింగ్ హమద్ మనామాలో జెలెన్స్కీకి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రిన్స్, ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు.
ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను వారు సమీక్షించారు. ఇటీవల ఇరాన్, బహ్రెయిన్ మరియు ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాలపై జరిపిన దాడుల నేపథ్యంలో జెలెన్స్కీ బహ్రెయిన్కు చూపిన సంఘీభావానికి కింగ్ హమద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉక్రెయిన్లో సుస్థిర శాంతిని సాధించేందుకు చర్చలు, దౌత్యనీతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు బహ్రెయిన్ మద్దతుగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







