భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- May 06, 2026
జర్నలిజం రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే పులిట్జర్ ప్రైజ్ ఈ ఏడాది ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. సైబర్ మోసాలు, డేటా గోప్యత ఉల్లంఘనలు ,డిజిటల్ నిఘాపై లోతైన పరిశోధనాత్మక కథనాలు అందించినందుకు గాను ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. వీరితో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్బెర్గ్’ (Bloomberg)కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉన్నారు.
వీరు చేపట్టిన పరిశోధనను “Illustrated Reporting and Commentary” విభాగంలో విజేతగా నిలిచారు. ఆధునిక సాంకేతికత వ్యక్తిగత గోప్యతకు ఎలా ముప్పుగా మారుతుందో, ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు డేటాను ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో విజువల్ డేటా, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా క్లిష్టమైన అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.
కథనాల ప్రభావం–అంతర్జాతీయ చర్చ
ఈ ముగ్గురు జర్నలిస్టులు చేసిన సంయుక్త పరిశోధన ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సెక్యూరిటీపై కొత్త చర్చలకు దారితీసింది. వారి కథనాలు అంతర్జాతీయ స్థాయిలో సైబర్ మోసాల గుట్టు విప్పడమే కాకుండా, పలు దేశాల్లో విధానపరమైన మార్పులకు ప్రేరణగా నిలిచాయి. డిజిటల్ దర్యాప్తు జర్నలిజంలో భారతీయ జర్నలిస్టులు సాధించిన ఈ విజయం ఒక కొత్త మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
గతంలో పలువురు భారతీయ జర్నలిస్టులు పులిట్జర్ గెలుచుకున్నప్పటికీ, ఆధునిక సాంకేతిక అంశాలపై చేసిన ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ భారత మీడియా ప్రతిభను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. యువ జర్నలిస్టులకు నిజాన్వేషణ మరియు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ పట్ల ఈ అవార్డు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







