అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- May 08, 2026
కరీంనగర్: భక్తితో సమాజంలో మెదలాలని తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.నరేందర్ రెడ్డి వారి పరివారంతో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో వారి సారథ్యంలో బ్రహ్మశ్రీ .గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహింపబడేటువంటి సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞాన్ని వేడుకగా సాంప్రదాయబద్ధంగా శ్రీరాముడికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణంలోని సుందరకాండ కు ప్రత్యేకత ఉన్నదని మరియు రామాయణం యొక్క విశిష్టతను తెలియపరచినటువంటి సుందరకాండని ప్రతి ఒక్కరూ పట్టించాలని మరియు తెలుసుకోవాలని వారు చెప్పారు.వాల్మీకి మహర్షి రచించినటువంటి సుందరకాండ ద్వారా రామాయణం మొత్తం తెలుసుకోగలుగుతామని మరియు సీతను కనుగొనేందుకు హనుమంతుడు చేసినటువంటి ప్రయత్నాలను చాలా చక్కగా తెలుసుకోవచ్చని వారు చెప్పారు.
సుమారు 2000 శ్లోకాలు కలిగినటువంటి సుందరకాండలో అత్యద్భుతంగా విషయాలు తెలపడం జరిగిందని వారు చెప్పారు.ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సుందరకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకమని మరియు ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని భక్తి భావంతో మెదడాలని మరియు తోటి వారికి సహాయపడాలని సూచించారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆప్యాయతను, ఓపికను పెంపొందించుకొని అభివృద్ధి వైపు పయనించాలని వారు చెప్పారు
మరో ఆత్మీయ అతిథి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడు సకల బలశాలని మరియు రాముని కొలిచినటువంటి తీరు నేటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు. సుందరకాండలోని విషయాల ద్వారా రామాయణం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలుగుతామని వారు చెప్పారు. హనుమంతుడు అంకితభావానికి నిర్వచనమని మరియు భక్తి భావానికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ వొంటల సత్యనారాయణ రెడ్డి పలువురు ఆలయాల కమిటీల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రవచనం అనంతరం పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి భజనలు భక్తి భావాన్ని పెంపొందించాయి మరియు ప్రాంగణాన్ని చక్కగా అలంకరించి పండుగ వాతావరణం వెల్లివిరిసే విధంగా చేశారు
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







