ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్..‘రాయల్ సీమ’ అంటు బాబు ఆసక్తికర ట్వీట్
- May 08, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో సుమారు రూ.2,200 కోట్లతో అత్యాధునిక మోటార్సైకిళ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాకను సీఎం చంద్రబాబు “రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమలోకి దూసుకుపోతోంది! రాయలసీమ ఇప్పుడు రాయల్ సీమ” అంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. బుల్లెట్ బైక్ ఫొటోతో ఆయన పెట్టిన ఈ పోస్ట్ రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనమని అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టు కోసం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వన్నెలూరు, రాళ్ళకుప్పం గ్రామాల్లో ప్రభుత్వం 267 ఎకరాల భూమిని కేటాయించింది. రెండు దశల్లో నిర్మించనున్న ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొదటి దశను 2029 నాటికి, రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









