ఇక 'ఫింగోపే' తో పెమెంట్లు సులభం
- August 07, 2016
షాపింగ్కు వెళ్లేటప్పుడు పర్సులో డబ్బు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాల్సి వస్తోంది. ఏమరపాటును మర్చిపోతే.. బిల్లు చెల్లింపు వద్ద ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. ఈ సమస్యను అధిగమించే సాధనం రాబోతోంది. చేతి వేలులోని రక్తనాళాన్ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే 'ఫింగోపే' అనే పరిజ్ఞానాన్ని బ్రిటన్కు చెందిన స్టాలర్ అనే సంస్థ రూపొందించింది. .
ఈ పరిజ్ఞానంలో ఒక బయోమెట్రిక్ రీడర్ ఉంటుంది. ఇది వినియోగదారుడి వేళ్లలోని సిరలను స్కాన్ చేస్తుంది. తద్వారా ప్రతి వినియోగదారుడికి సంబంధించిన ఒక విశిష్ట మ్యాప్ను నిర్మిస్తుంది. దీన్ని క్రెడిట్ కార్డు లేదా బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తుంది. ఫలితంగా బుల్లి స్కానర్పై వేలును ఉంచడం ద్వారా దుకాణంలో సొమ్మును చెల్లించవచ్చు. ఇద్దరు వ్యక్తులకు ఒకే తరహా సిర నిర్మాణం ఉండే అవకాశం 340 కోట్లలో ఒక వంతు మాత్రమే ఉందని పరిశోధకులు తెలిపారు. అంటే ఈ పరిజ్ఞానం దుర్బేధ్యమైనదని చెప్పారు. దీన్ని లండన్లోని ఒక నైట్ క్లబ్లో పరీక్షించనున్నట్లు సదరు కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







