కువైట్ లో మనీలాండరింగ్ కేసు..నిందితుడిని అప్పగించిన యూఏఈ..!!
- May 11, 2026
కువైట్: మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన ఒక భారతీయ వ్యక్తిని ఇంటర్పోల్ సహకారంతో యూఏఈ అప్పగించినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కువైట్, యూఏఈ మధ్య ద్రతా సహకారంలో భాగంగా ఈ అప్పగింత జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అప్పగింత ఇంటర్పోల్ అబుదాబి ద్వారా జరిగిందని, దుబాయ్లోని క్రిమినల్ సెక్యూరిటీ బ్యూరో దీనిని పర్యవేక్షించిందని పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షతో కూడిన 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. శిక్ష అనుభవించిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని, అలాగే నేర కార్యకలాపాల ద్వారా పొందిన నిధులు, ప్రయోజనాలన్నింటినీ జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించిందని మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది.
కువైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ దేశంలో మద్యం అక్రమ అమ్మకాలు, వ్యాపారంలో పాలుపంచుకుంటున్న ముఠాను దర్యాప్తులో గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ ముఠా 13 లైసెన్స్ పొందిన స్థానిక ఎక్స్ఛేంజ్ కంపెనీల ద్వారా 254 అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసినట్లు, ఇందుకు 157 మంది ఆసియా జాతీయుల అకౌంట్లను ఉపయోగించుకుందని, వీటి మొత్తం విలువ KD 433,745.875 అని దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక సంస్థలను బురిడీ కొట్టించి, కుటుంబ ఖర్చులు అనే ముసుగులో విదేశాలకు పంపినట్లు గుర్తించినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







