కువైట్ లో మనీలాండరింగ్ కేసు..నిందితుడిని అప్పగించిన యూఏఈ..!!
- May 11, 2026
కువైట్: మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన ఒక భారతీయ వ్యక్తిని ఇంటర్పోల్ సహకారంతో యూఏఈ అప్పగించినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కువైట్, యూఏఈ మధ్య ద్రతా సహకారంలో భాగంగా ఈ అప్పగింత జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అప్పగింత ఇంటర్పోల్ అబుదాబి ద్వారా జరిగిందని, దుబాయ్లోని క్రిమినల్ సెక్యూరిటీ బ్యూరో దీనిని పర్యవేక్షించిందని పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షతో కూడిన 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. శిక్ష అనుభవించిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని, అలాగే నేర కార్యకలాపాల ద్వారా పొందిన నిధులు, ప్రయోజనాలన్నింటినీ జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించిందని మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది.
కువైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ దేశంలో మద్యం అక్రమ అమ్మకాలు, వ్యాపారంలో పాలుపంచుకుంటున్న ముఠాను దర్యాప్తులో గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ ముఠా 13 లైసెన్స్ పొందిన స్థానిక ఎక్స్ఛేంజ్ కంపెనీల ద్వారా 254 అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసినట్లు, ఇందుకు 157 మంది ఆసియా జాతీయుల అకౌంట్లను ఉపయోగించుకుందని, వీటి మొత్తం విలువ KD 433,745.875 అని దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక సంస్థలను బురిడీ కొట్టించి, కుటుంబ ఖర్చులు అనే ముసుగులో విదేశాలకు పంపినట్లు గుర్తించినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







