ఈద్ హబ్తా మార్కెట్ కోసం కొత్త నిబంధనలు జారీ..!!
- May 11, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ లో రాబోయే ఈద్ పండుగ నేపథ్యంలో 'హబ్తా'గా పిలువబడే సాంప్రదాయ మార్కెట్లను నియంత్రించే నిబంధనలను మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది. వాణిజ్య కార్యకలాపాలతోపాటు ప్రజల భద్రతను నిర్ధారించడానికి వీటిని రూపొందించిటనట్టు పేర్కొంది.
విక్రేతలందరూ తప్పనిసరిగా 3 x 3 మీటర్ల ప్రామాణిక బ్లూ అంబ్రెల్లాను ఉపయోగించాలని మున్సిపాలిటీ ఆదేశించింది. ఈ నిబంధన "గ్రౌండ్ సెల్లింగ్"ను నిషేధించింది. అన్ని సరుకులను ఈ నిర్దేశిత నిర్మాణాల కిందనే పెట్టాలని తెలిపింది. మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి కనీసం ఐదు రోజుల ముందే విక్రేతలు తమ స్టాల్స్ను పూర్తిగా సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అమ్మకాలలో పాల్గొనే ప్రవాస కార్మికులు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉన్న లేబర్ కార్డును కలిగి ఉండాలని మున్సిపాలిటీ స్పష్టం చేసింది. ట్రాఫిక్ ప్రవాహాన్ని మరియు పాదచారుల భద్రతను నిర్వహించే ప్రయత్నంలో హబ్తా జరిగే ప్రదేశాలలోకి స్ట్రీట్ వెండర్స్ బండ్లను నిషేధించారు. ఈ కార్యక్రమంలో ఏవైనా వస్తువులు లేదా పరికరాలు పోయినా లేదా పాడైనా, దానికి తాము బాధ్యత వహించబోమని మున్సిపాలిటీ పేర్కొంది.
ఈద్కు ముందు కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే పశువుల వ్యాపారంపై కూడా ప్రత్యేక నియంత్రణలు విధించారు. పశువుల యజమానులు తమకు కేటాయించిన జోన్లలోనే కచ్చితంగా కార్యకలాపాలు నిర్వహించాలి. బహిరంగ రహదారులపై లేదా అధికారిక సరిహద్దుల వెలుపల జంతువులను ప్రదర్శించడాన్ని నిషేధించారు.
"హబ్తా" అనేది శతాబ్దాల నాటి ఒమానీ సంప్రదాయం. ఇది సాధారణంగా ఈద్ సెలవులకు ముందు చివరి రోజులలో జరుగుతుంది. ఈ బహిరంగ మార్కెట్లలో పౌరులు మరియు నివాసితులు బలిచ్చే జంతువులు, సుగంధ ద్రవ్యాల నుండి సాంప్రదాయ ఒమానీ కత్తులు (ఖంజార్లు) మరియు పిల్లల బొమ్మల వరకు అన్నింటినీ కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







