మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- May 12, 2026
యూఏఈః మలిహా రోడ్డును, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వైపు వెళ్లే మార్గంతో కలిపే ఒక కొత్త 3-లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు. ఈ బ్రిడ్జి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ మరియు మలిహా రోడ్డు కలిసే ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి Dh140 మిలియన్ల వ్యయం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభమై, ఒక సంవత్సరంలోపు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం సుమారు 9 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!
- ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!









