'2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభo...
- August 07, 2016
శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం '2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభమయింది. 'రోబో' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దాని సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ సరసన ఎమిజాక్సన్ నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ కనిపించనున్నారు. దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నట్లు, అందులో అక్షయ్కుమార్ కనిపించేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మరోవైపు ప్రతినాయకుడిగా అక్షయ్కుమార్ రూపం ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. 'కబాలి' చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణలో రజనీకాంత్ పాల్గొనలేదు. ఆయనకు సంబంధించిన సన్నివేశాలను మినహాయించి ఇతర నటీనటులపై మాత్రం చిత్రీకరించారు. యాభై శాతం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు శంకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అమెరికాలో విశ్రాంతి తీసుకుని గత వారం చెన్నై వచ్చారు. మళ్లీ '2.ఓ' చిత్రీకరణ మొదలుపెట్టారు. ఆదివారం ఉదయం చెన్నైలోని అయనావరంలో చిత్రీకరణ కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనరుకు ప్రజలు వినతులు సమర్పించే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులోనూ రజనీకాంత్ పాల్గొనలేదు. ఆ ప్రాంతానికి రజనీ అభిమానులు, స్థానికులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అయనావరం పోర్చీస్ రోడ్డులో ట్రాఫిక్ను మళ్లించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









