బాలయ్య సినిమాలో ‘హనీ రోజ్’ రీఎంట్రీ
- May 13, 2026
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ (NBK 111) సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మీనాక్షి’ పాత్ర, ‘సుగుణ సుందరి’ సాంగ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సందడి చేశాయో అందరికీ తెలిసిందే. బాలయ్య సరసన హనీ రోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్గా ఉండటంతో, మరోసారి ఆ సక్సెస్ ఫుల్ కెమిస్ట్రీని వెండితెరపై ఆవిష్కరించేందుకు గోపీచంద్ మలినేని సిద్ధమయ్యారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ మాఫియా డాన్గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్లో ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. హనీ రోజ్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 2026 ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతం కాగా, గోపీచంద్ తన మార్కు మాస్ ఎలిమెంట్స్తో బాలయ్యను వెండితెరపై పవర్ఫుల్గా ప్రెజెంట్ చేస్తున్నారు. బాలయ్య-గోపీచంద్ కాంబో అంటేనే మాస్ ఎలివేషన్లకు పెట్టింది పేరు. దీనికి తోడు హనీ రోజ్ తోడవడంతో థియేటర్లలో మరోసారి పూనకాలు గ్యారెంటీ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాలో బాలయ్య లుక్, డైలాగ్స్ సరికొత్తగా ఉంటాయని చిత్ర బృందం హింట్ ఇస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









