ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- May 14, 2026
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్వర్క్లలో కనిపించని వైకల్యాలున్న ప్రయాణికుల కోసం సన్ఫ్లవర్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ 'హిడెన్ డిసేబిలిటీస్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్' తమకు కనిపించని వైకల్యం ఉందని ప్రయాణికులు స్వచ్ఛందంగా, సులభంగా తెలియజేయడానికి ఒక పొద్దుతిరుగుడు పువ్వు సింబల్ ను ఉపయోగిస్తుంది.
గత సంవత్సరం విజయవంతమై సానుకూల స్పందన పొందిన 'బెస్ట్ బడ్డీస్' కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ఒక ప్రకటనలో తెలిపింది.
కస్టమర్ సర్వీస్ బృందాలు సన్ఫ్లవర్ చిహ్నాన్ని గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందాయని, కనిపించని వైకల్యాలు ఉన్న ప్రయాణికులకు శ్రద్ధతో సహాయం చేయడానికి వారు పూర్తిగా సన్నద్ధమై ఉంటారని పేర్కొంది.
ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఖతార్ రైల్ పునరుద్ఘాటించింది. సన్ఫ్లవర్ను ధరించడం ద్వారా ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో ప్రయాణిస్తున్నప్పుడు తమకు మరింత సమయం, అదనపు మద్దతు అవసరమని సైలెంట్ గా తెలియజేయవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?







