ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- May 14, 2026
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్వర్క్లలో కనిపించని వైకల్యాలున్న ప్రయాణికుల కోసం సన్ఫ్లవర్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ 'హిడెన్ డిసేబిలిటీస్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్' తమకు కనిపించని వైకల్యం ఉందని ప్రయాణికులు స్వచ్ఛందంగా, సులభంగా తెలియజేయడానికి ఒక పొద్దుతిరుగుడు పువ్వు సింబల్ ను ఉపయోగిస్తుంది.
గత సంవత్సరం విజయవంతమై సానుకూల స్పందన పొందిన 'బెస్ట్ బడ్డీస్' కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ఒక ప్రకటనలో తెలిపింది.
కస్టమర్ సర్వీస్ బృందాలు సన్ఫ్లవర్ చిహ్నాన్ని గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందాయని, కనిపించని వైకల్యాలు ఉన్న ప్రయాణికులకు శ్రద్ధతో సహాయం చేయడానికి వారు పూర్తిగా సన్నద్ధమై ఉంటారని పేర్కొంది.
ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఖతార్ రైల్ పునరుద్ఘాటించింది. సన్ఫ్లవర్ను ధరించడం ద్వారా ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో ప్రయాణిస్తున్నప్పుడు తమకు మరింత సమయం, అదనపు మద్దతు అవసరమని సైలెంట్ గా తెలియజేయవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!
- రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...









