ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- May 14, 2026
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్వర్క్లలో కనిపించని వైకల్యాలున్న ప్రయాణికుల కోసం సన్ఫ్లవర్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ 'హిడెన్ డిసేబిలిటీస్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్' తమకు కనిపించని వైకల్యం ఉందని ప్రయాణికులు స్వచ్ఛందంగా, సులభంగా తెలియజేయడానికి ఒక పొద్దుతిరుగుడు పువ్వు సింబల్ ను ఉపయోగిస్తుంది.
గత సంవత్సరం విజయవంతమై సానుకూల స్పందన పొందిన 'బెస్ట్ బడ్డీస్' కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ఒక ప్రకటనలో తెలిపింది.
కస్టమర్ సర్వీస్ బృందాలు సన్ఫ్లవర్ చిహ్నాన్ని గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందాయని, కనిపించని వైకల్యాలు ఉన్న ప్రయాణికులకు శ్రద్ధతో సహాయం చేయడానికి వారు పూర్తిగా సన్నద్ధమై ఉంటారని పేర్కొంది.
ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఖతార్ రైల్ పునరుద్ఘాటించింది. సన్ఫ్లవర్ను ధరించడం ద్వారా ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో ప్రయాణిస్తున్నప్పుడు తమకు మరింత సమయం, అదనపు మద్దతు అవసరమని సైలెంట్ గా తెలియజేయవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







