యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నెథర్లాండ్స్ కు ప్రయాణం..

- May 15, 2026 , by Maagulf
యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నెథర్లాండ్స్ కు ప్రయాణం..

ఘనంగా వీడ్కోలు పలికిన యూఏఈ అధ్యక్షుడు

అబుదాబి: యూఏఈ అధికారిక పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు.

భారత్–యూఏఈ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం, ఆర్థిక సహకారం, ఇంధనం, సాంకేతికత, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై జరిగిన చర్చల అనంతరం ప్రధాని మోదీ తన తదుపరి పర్యటన కోసం యూఏఈ నుంచి బయలుదేరారు.

ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానానికి యూఏఈ సైనిక యుద్ధ విమానాలు ప్రత్యేక ఎస్కార్ట్ అందించడం విశేషంగా నిలిచింది. యూఏఈ గగనతలాన్ని వీడే వరకు సైనిక విమానాల బృందం ప్రధాని విమానాన్ని అనుసరించింది. ఈ సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ ప్రధాని విమానాన్ని యూఏఈ గగనతలం వరకు సాగనంపేందుకు అనుమతి కోరినట్లు అధికారులు తెలిపారు.

ప్రధాని మోదీ యూఏఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com