యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నెథర్లాండ్స్ కు ప్రయాణం..
- May 15, 2026
ఘనంగా వీడ్కోలు పలికిన యూఏఈ అధ్యక్షుడు
అబుదాబి: యూఏఈ అధికారిక పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు.
భారత్–యూఏఈ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం, ఆర్థిక సహకారం, ఇంధనం, సాంకేతికత, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై జరిగిన చర్చల అనంతరం ప్రధాని మోదీ తన తదుపరి పర్యటన కోసం యూఏఈ నుంచి బయలుదేరారు.
ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానానికి యూఏఈ సైనిక యుద్ధ విమానాలు ప్రత్యేక ఎస్కార్ట్ అందించడం విశేషంగా నిలిచింది. యూఏఈ గగనతలాన్ని వీడే వరకు సైనిక విమానాల బృందం ప్రధాని విమానాన్ని అనుసరించింది. ఈ సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ ప్రధాని విమానాన్ని యూఏఈ గగనతలం వరకు సాగనంపేందుకు అనుమతి కోరినట్లు అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ యూఏఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







