'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్
- May 15, 2026
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్, 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి రికార్డింగ్ స్టూడియోలో కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫోటో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
పూరి మార్క్ ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్కు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా పవర్ఫుల్గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ ఎక్స్ప్లోసివ్ కాంబోపై భారీ అంచనాలు నెలకొనగా, మేకర్స్ త్వరలోనే మరిన్ని స్ట్రైకింగ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ లు హ్యుమరస్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.
తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ









