2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- May 18, 2026
యూఏఈ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీతాల చెల్లింపులపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ (WPS) కింద దేశవ్యాప్తంగా జీతాల చెల్లింపుకు ఒకే విధమైన గడువును నిర్ణయిస్తూ యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి గ్రెగోరియన్ నెల మొదటి తేదీన గత నెల జీతాలను ఉద్యోగులకు చెల్లించాలి. ఆ తేదీ తర్వాత చెల్లింపులు జరిగితే అవి ఆలస్యంగా చెల్లించినట్లుగా పరిగణించబడతాయి. ఈ నిర్ణయాన్ని మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (Mohre) జారీ చేసిన మంత్రిత్వ తీర్మానం ఆధారంగా అమలు చేస్తున్నారు.
ప్రైవేట్ రంగ సంస్థలు అన్ని జీతాలను అధికారిక వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇతర చెల్లింపు మార్గాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు చెల్లించినట్లు రికార్డులు, పత్రాలు సమర్పించడం కూడా సంస్థలకు తప్పనిసరి.
85 శాతం జీతం చెల్లిస్తేనే అనుగుణత
కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం వేతనాల్లో కనీసం 85 శాతం గడువులోపు చెల్లిస్తేనే సంస్థ నిబంధనలు పాటించినట్లుగా పరిగణిస్తారు. చట్టబద్ధమైన కోతలు లేదా నిలుపుదలల కారణంగా మిగిలిన మొత్తం చెల్లించకపోయినా, ఉద్యోగి జీతం పొందినట్లుగానే పరిగణిస్తారు. అయితే మిగిలిన బకాయిలను ఉద్యోగి క్లెయిమ్ చేసుకునే హక్కు కొనసాగుతుంది.
జీతాల ఆలస్యం పై కఠిన చర్యలు
- గడువులోపు జీతాలు చెల్లించని సంస్థల పై దశలవారీగా చర్యలు తీసుకోనున్నారు.
- గడువు దాటిన రెండో రోజు నుంచే సంస్థలకు హెచ్చరికలు పంపిస్తారు.
- ఐదో రోజు నుంచి కొత్త వర్క్ పర్మిట్ల జారీ నిలిపివేస్తారు.
- 11వ రోజు తర్వాత కూడా జీతాలు చెల్లించకపోతే పరిపాలనా జరిమానాలు విధించడంతో పాటు సంస్థను మూడో కేటగిరీకి డౌన్గ్రేడ్ చేస్తారు.
- 16వ రోజు తర్వాత ఉద్యోగుల తరఫున లేబర్ వివాదాలను స్వయంచాలకంగా నమోదు చేస్తారు.
- 21వ రోజు తర్వాత కంపెనీపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి, అవసరమైతే యజమానిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించవచ్చు.
రెండు నెలలు వరుసగా ఉల్లంఘనలు చేసిన 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు కూడా పంపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణ, రవాణా, భద్రత, క్లీనింగ్, రిక్రూట్మెంట్ రంగాలపై ఈ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి.
WPS నుంచి మినహాయింపులు
కొన్ని వర్గాల ఉద్యోగులు, సంస్థలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. కోర్టులో వేతన వివాదాలు ఉన్న ఉద్యోగులు, పరారైనట్లు నమోదైన కార్మికులు, చట్టపరమైన నిర్బంధంలో ఉన్నవారు, అనుమతితో జీతం లేని సెలవులో ఉన్నవారు ఈ పరిధిలోకి రారు.
అలాగే విదేశీ సంస్థల ఉద్యోగులు, సముద్ర కార్మికులు, మూడు నెలల వరకు తాత్కాలిక మిషన్ పర్మిట్పై పనిచేసేవారు, వ్యక్తిగత యాజమాన్యంలోని ఫిషింగ్ బోట్లు, పబ్లిక్ టాక్సీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రార్థనా మందిరాలకు కూడా మినహాయింపులు ఉంటాయి.
ఈ కొత్త విధానం ద్వారా జీతాల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో పాటు ఉద్యోగుల హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని యూఏఈ ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







