ఒమన్లో నిర్మాణ సామగ్రి ధరలపై సీపీఏ కీలక ప్రకటన..!!
- May 19, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో నిర్మాణ సామగ్రి ధరలకు సంబంధించి వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీపీఏ) ఒక ప్రకటన జారీ చేసింది. నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక మార్కెట్లలో వాటి పెరిగిన ధరల గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను వినియోగదారుల పరిరక్షణ అథారిటీ పర్యవేక్షిస్తోందన్నారు.
ధరల పెరుగుదల ప్రకటన ఫేక్ అని, అది వాస్తవ ధరల స్థాయిలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని అథారిటీ స్పష్టం చేసింది. ఉదాహరణకు, ఈ సంవత్సరం (2026) ఫిబ్రవరి మరియు మే నెలల మధ్య ఐరన్ ధర కేవలం 12 శాతం, సిమెంట్ ధరలు 18 శాతం పెరిగాయని తెలిపింది.
స్థానిక సామగ్రితో సహా భవన నిర్మాణ సామగ్రి ధరలు సరఫరా మరియు డిమాండ్, ఇతర పరిస్థితుల కారణంగా ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను బట్టి వివిధ స్థాయిలలో ధరలు పెరుగుదల ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితిని నిరోధించడానికి, వివిధ మార్కెట్లలో భవన నిర్మాణ సామగ్రి ధరలను పర్యవేక్షించేందుకు అథారిటీ తన పర్యవేక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని తెలిపింది. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అనేక సంస్థలను గుర్తించడం జరిగిందని, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ, యూఏఈలపై డ్రోన్ దాడులను ఖండించిన ఎంపీలు..!!
- ఎన్నారైలు యూఏఈ నుండి డ్యూటీ ఫ్రీలో బంగారు నాణేలు తీసుకువెళ్లవచ్చా?
- పవిత్ర స్థలాల్లో పర్యటించిన మక్కా డిప్యూటీ ఎమిర్..!!
- ఒమన్లో నిర్మాణ సామగ్రి ధరలపై సీపీఏ కీలక ప్రకటన..!!
- డిజిటల్ రిమోట్ టవర్ వ్యవస్థతో 360-డిగ్రీల కవరేజీ: ఖతార్
- కువైట్-సౌదీ రైలు మార్గానికి ఆమోదం..!!
- శాన్ డియాగో మసీదులో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి
- యూఏఈలో 16 భారతీయ వీసా, కాన్సులర్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్న అల్హింద్ గ్రూప్
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!









