'Flying Tiger' రెండవ ఉత్పత్తిని వెనక్కి తీసుకున్న సౌదీ..!!
- May 20, 2026
యూఏఈః ఊపిరాడకుండా చేసే (choking) ప్రమాదం ఉండవచ్చనే కారణంతో 'Flying Tiger Copenhagen' సంస్థకు చెందిన పిల్లల ఉత్పత్తిని వెనక్కి తీసుకోవాలని సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
2024 మరియు 2025 మధ్య తయారైన సుమారు 537 'పిల్లల టీ సెట్ గేమ్' (Children’s Tea Set Game) యూనిట్లను దుకాణాల నుండి తొలగించారు. ఇది చిన్న పిల్లలకు ఊపిరాడకుండా చేసే ప్రమాదాన్ని కలిగిస్తుందని సౌదీ అధికారులు హెచ్చరించారు. ఈ ఉత్పత్తి ఐటమ్ నంబర్: 3058431గా పేర్కొన్నారు.
వినియోగదారులు ఈ ఉత్పత్తిని వెంటనే వాడటం ఆపివేసి, పూర్తి డబ్బు వాపసు (refund) పొందడానికి దానిని కొనుగోలు చేసిన దుకాణానికి తిరిగి అప్పగించాలని కోరారు. ఉత్పత్తిని సురక్షితంగా తిరిగి అప్పగించేంత వరకు, పిల్లలకు అందుబాటులో లేకుండా దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు ఈ రీకాల్ నోటీసులో సూచించారు.
ఏప్రిల్ నెలలో ప్రకటించిన ఒక రీకాల్ను అనుసరించి ఈ తాజా చర్య తీసుకున్నారు. ఆ సమయంలో అధికారులు 'Flying Tiger' సంస్థకు చెందిన 6,341 గాజు గ్లాసుల (220ml) యూనిట్లను మార్కెట్ నుండి తొలగించారు. ప్రభావిత ఉత్పత్తులు 2024 మరియు 2025 సంవత్సరాలలో విక్రయించినట్టు పేర్కొన్నారు.
ఆ గాజు గ్లాసుల బయటి భాగంలో ముద్రించిన డిజైన్లలో సీసం (lead) మరియు కాడ్మియం (cadmium) స్థాయిలు అధికంగా ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలడంతో ఈ రీకాల్ ప్రక్రియ ప్రారంభమైంది. వీటిని పదే పదే వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదాలు ఏర్పడవచ్చని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు.
రీకాల్ చేసిన గాజు గ్లాసుల ఉత్పత్తి నంబర్లు 3060031, 3057450, 3062993, 3052986, 3053912, 3055350 గా పేర్కొన్నారు. అధిక స్థాయిలో సీసం ఉన్నట్లు తేలిన ఈ ఉత్పత్తికకి సంబంధించి యూఏఈ, కువైట్ దేశాలు కూడా ఇంతకుముందే ఇలాంటి హెచ్చరికలనే జారీ చేశాయి.
తాజా వార్తలు
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!
- దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బహ్రెయిన్ మత వైవిధ్యం..!!
- 'Flying Tiger' రెండవ ఉత్పత్తిని వెనక్కి తీసుకున్న సౌదీ..!!
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు









