భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!
- July 16, 2026
దుబాయ్:హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడిలో గాయపడిన భారతీయ నావికులను దుబాయ్లోని భారత కాన్సులేట్ అధికారులు పరామర్శించారు. యూఏఈలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జూలై 14 రాత్రి ఎమ్టీ అల్ బహియాహ్ మరియు ఎమ్టీ మొంబాసా వాణిజ్య ట్యాంకర్ల నుంచి తరలించిన భారతీయ సిబ్బందిని అధికారులు కలిశారు. అలాగే దిబ్బా, ఖోర్ఫక్కాన్, ఫుజైరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న గాయపడిన నావికులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
హోర్ముజ్ జలసంధిలో ఒమాన్ ప్రాదేశిక జలాల సమీపంలో ప్రయాణిస్తున్న రెండు ట్యాంకర్లపై క్షిపణి దాడి జరగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మృతి చెందగా, మొత్తం ఎనిమిది మంది సిబ్బంది గాయపడ్డారు. వారిలో నలుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉండగా, నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. గాయపడిన భారతీయ నావికులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు కాన్సులేట్ అధికారులు ఆసుపత్రులు, నౌక నిర్వహణ సంస్థ, యూఏఈ అధికార యంత్రాంగం, బాధితుల కుటుంబాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడిని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ, మృతి చెందిన భారతీయ నావికుడి కుటుంబానికి, భారత ప్రభుత్వానికి సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







