లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- May 20, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్, ఐపీఎస్, మరియు హోం శాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, ఐపీఎస్, ఈరోజు రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
లోక్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర భద్రతా పరిస్థితులు, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలీసు శాఖ పనితీరు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు మరియు పరిపాలనా అంశాలపై కూడా వారు గవర్నర్కు వివరించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ చేస్తున్న సేవలను అభినందించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి కొనసాగించాలని సూచించారు.సమావేశం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









