లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- May 20, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్, ఐపీఎస్, మరియు హోం శాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, ఐపీఎస్, ఈరోజు రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
లోక్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర భద్రతా పరిస్థితులు, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలీసు శాఖ పనితీరు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు మరియు పరిపాలనా అంశాలపై కూడా వారు గవర్నర్కు వివరించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ చేస్తున్న సేవలను అభినందించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి కొనసాగించాలని సూచించారు.సమావేశం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







