ఖతార్‌లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!

- May 21, 2026 , by Maagulf
ఖతార్‌లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!

దోహా: ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ ఆధ్వర్యంలో పనిచేసే 'ఇండియన్ కల్చరల్ సెంటర్' (ICC) వివిధ పాఠశాలలకు చెందిన 10వ మరియు 12వ తరగతి CBSE టాపర్లను సన్మానించింది. ICC అశోక హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి H.E. విపుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి, అభినందనలు తెలిపారు.  భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చూపిన అంకితభావం, అందించిన సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ICC అధ్యక్షుడు A.P. మణికందన్, ప్రధాన కార్యదర్శి అబ్రహం కె. జోసెఫ్, ఉపాధ్యక్షుడు శాంతను దేశ్‌పాండే, సలహా మండలి ఛైర్మన్ P. N. బాబు రాజన్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com