నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- May 21, 2026
మక్కా: వాణిజ్య మంత్రిత్వ శాఖ నెలరోజుల్లో మక్కా మరియు మదీనా ప్రాంతాలలోని వాణిజ్య సంస్థలు మరియు రిటైల్ అవుట్లెట్లలో 42,791 తనిఖీలు నిర్వహించింది. ప్రస్తుత హజ్ సీజన్ కోసం రూపొందించిన పర్యవేక్షణ ప్రణాళికలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిత్యావసర వస్తువుల స్టాక్ తోపాటు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు, యాత్రికుల విభిన్న అవసరాలను తీర్చడానికి స్థానిక మార్కెట్ల సంసిద్ధతను బలోపేతం చేయడం తనిఖీల లక్ష్యమని తెలిపింది.
తనిఖీల్లో భాగంగా రిటైల్ కేంద్రాలు, పబ్లిక్ మార్కెట్లు, ఆభరణాల దుకాణాలలో కూడా ఇన్స్పెక్టర్లు పరిశీలించినట్లు పేర్కొన్నది. వాణిజ్య నిబంధనల అమలు, యాత్రికులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. హజ్ సీజన్ మొత్తం తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డ్రింక్స్ ల్లో మత్తుమందు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి..!!
- యూఏఈలో సమ్మర్ సందడి.. బీచ్ భద్రత, ప్రథమ చికిత్సపై అవగాహన..!!
- నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ ప్రాజెక్టు.. కొత్తగా 7 కి.మీ. ప్రారంభం..!!
- పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్లైన్
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి
- తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?









