ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- May 21, 2026
దుబాయ్: ఈద్ అల్ అధా పండుగను పురస్కరించుకుని దుబాయ్ రూలర్, యూఏఈ ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 836 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వివిధ జాతీయతలకు చెందిన ఈ ఖైదీలు దుబాయ్లోని సవరణ మరియు శిక్షా కేంద్రాల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ విషయాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ హిజ్ ఎక్సలెన్సీ చాన్సలర్ ఎస్సామ్ ఈసా అల్ హుమైదాన్ వెల్లడించారు. షేక్ మొహమ్మద్ తీసుకున్న ఈ నిర్ణయం ఖైదీల కుటుంబాల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, వారికి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేందుకు ఖైదీలకు మరో అవకాశం ఇవ్వాలనే దయా దాక్షిణ్యంతో ఈ క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్నారని అల్ హుమైదాన్ తెలిపారు.
షేక్ మొహమ్మద్ ఆదేశాల అమలుకు సంబంధించి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసులతో కలిసి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రతి ఏడాది రమదాన్, ఈద్ వంటి ముఖ్యమైన సందర్భాల్లో యూఏఈ నాయకత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీని ద్వారా ఖైదీలకు కొత్త ఆరంభానికి అవకాశం కల్పించడంతో పాటు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







