ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- May 21, 2026
దుబాయ్: ఈద్ అల్ అధా పండుగను పురస్కరించుకుని దుబాయ్ రూలర్, యూఏఈ ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 836 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వివిధ జాతీయతలకు చెందిన ఈ ఖైదీలు దుబాయ్లోని సవరణ మరియు శిక్షా కేంద్రాల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ విషయాన్ని దుబాయ్ అటార్నీ జనరల్ హిజ్ ఎక్సలెన్సీ చాన్సలర్ ఎస్సామ్ ఈసా అల్ హుమైదాన్ వెల్లడించారు. షేక్ మొహమ్మద్ తీసుకున్న ఈ నిర్ణయం ఖైదీల కుటుంబాల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, వారికి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేందుకు ఖైదీలకు మరో అవకాశం ఇవ్వాలనే దయా దాక్షిణ్యంతో ఈ క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్నారని అల్ హుమైదాన్ తెలిపారు.
షేక్ మొహమ్మద్ ఆదేశాల అమలుకు సంబంధించి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసులతో కలిసి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియలను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
ప్రతి ఏడాది రమదాన్, ఈద్ వంటి ముఖ్యమైన సందర్భాల్లో యూఏఈ నాయకత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీని ద్వారా ఖైదీలకు కొత్త ఆరంభానికి అవకాశం కల్పించడంతో పాటు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







