గురుదేవ్ నవలను సినిమా చేయాలని నిర్మాత రవి కుమార్ పనసకు సూచన
- May 22, 2026
‘భగవంతుడు’ చిత్రానికి శ్రీశ్రీ రవిశంకర్ ఆశీస్సులు
బెంగళూరు: ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనసా సినీ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. పలు వ్యాపార రంగాల్లో విజయవంతంగా రాణించిన ఆయన, ఇప్పుడు ‘భగవంతుడు’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఆధ్యాత్మిక సమావేశంలో రవి కుమార్ పనసకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ను కలిసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ‘భగవంతుడు’ సినిమా టీజర్ను గురుదేవ్ వీక్షించి చిత్ర బృందం చేసిన కృషిని అభినందించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం రవి కుమార్ పనస సోషల్ మీడియాలో స్పందిస్తూ, గురుదేవ్ ఆశీస్సులు పొందడం జీవితంలో మరపురాని అనుభూతిగా పేర్కొన్నారు. సినిమా ఘన విజయం సాధించాలని శ్రీశ్రీ రవిశంకర్ ఆకాంక్షించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ తన రచనలోని ఒక నవలను రవి కుమార్ పనసాకు బహుమతిగా అందజేసి, అవకాశం ఉంటే దాన్ని సినిమాగా తెరకెక్కించాలని సూచించినట్లు తెలిసింది. ఈ సంఘటన తన సినీ ప్రయాణానికి మరింత ప్రేరణనిచ్చిందని రవి కుమార్ పనస తెలిపారు.
వ్యాపార రంగంలో గుర్తింపు పొందిన రవి కుమార్ పనస, ఇప్పుడు ఆధ్యాత్మిక స్పూర్తితో సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం విశేషంగా మారింది. ‘భగవంతుడు’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







