గోదావరి పుష్కరాల చివరిరోజు పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు
- July 24, 2015
గోదావరి పుష్కరాల చివరిరోజు పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఏపీ, తెలంగాణల్లోని గోదావరి పుష్కర ఘాట్లలో భక్తులు కిటకిటలాడారు. రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరు పుష్కరఘాట్లు భక్తులతో కోలాహలంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదార్ఘాట్, కోడేరు ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం ఆరు గంటలకు గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. వెయ్యిమంది కూచిపూడి కళాకారుల నృత్యం, మంగళంపల్లి బాలబురళీకృష్ణచే కర్ణాటక గాత్ర సంగీతం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









