గోదావరి పుష్కరాల చివరిరోజు పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు

- July 24, 2015 , by Maagulf
గోదావరి పుష్కరాల చివరిరోజు పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు

గోదావరి పుష్కరాల చివరిరోజు పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఏపీ, తెలంగాణల్లోని గోదావరి పుష్కర ఘాట్లలో భక్తులు కిటకిటలాడారు. రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరు పుష్కరఘాట్లు భక్తులతో కోలాహలంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదార్‌ఘాట్‌, కోడేరు ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాజమండ్రిలోని ఆర్ట్స్‌ కళాశాలలో సాయంత్రం ఆరు గంటలకు గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. వెయ్యిమంది కూచిపూడి కళాకారుల నృత్యం, మంగళంపల్లి బాలబురళీకృష్ణచే కర్ణాటక గాత్ర సంగీతం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com