ఢిల్లీ వెళ్ళిన 'బాహుబలి'
- July 25, 2015
బాహుబలి చిత్రం అనుకున్నదాని కంటే మరింత విజయం సాధించడంతో.. సినిమా హీరో ప్రభాస్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ తన పెదనాన్న, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజుతో కలిసి పలువురు ప్రముఖుల వద్దకు వెళ్తున్నాడు. ముందుగా ఆయన శనివారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శాలువాతో రాజ్ నాథ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్.. హీరో ప్రభాస్ ను అభినందించారు. బాహుబలిని తెలుగు నుంచి హిందీలోకి కూడా డబ్బింగ్ చేసిన విషయం తెలిసిందే. అది అక్కడ కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్ కు 73 కోట్ల రూపాయలు వచ్చాయి. 7.5 కోట్లు వస్తే చాలని అనుకోగా.. దాదాపు దానికి పది రెట్ల మొత్తం రావడం గమనార్హం.బాహుబలి 2 చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 15న ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







