ఢిల్లీ వెళ్ళిన 'బాహుబలి'
- July 25, 2015
బాహుబలి చిత్రం అనుకున్నదాని కంటే మరింత విజయం సాధించడంతో.. సినిమా హీరో ప్రభాస్ ఢిల్లీ వెళ్లాడు. అక్కడ తన పెదనాన్న, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజుతో కలిసి పలువురు ప్రముఖుల వద్దకు వెళ్తున్నాడు. ముందుగా ఆయన శనివారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. శాలువాతో రాజ్ నాథ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్.. హీరో ప్రభాస్ ను అభినందించారు. బాహుబలిని తెలుగు నుంచి హిందీలోకి కూడా డబ్బింగ్ చేసిన విషయం తెలిసిందే. అది అక్కడ కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్ కు 73 కోట్ల రూపాయలు వచ్చాయి. 7.5 కోట్లు వస్తే చాలని అనుకోగా.. దాదాపు దానికి పది రెట్ల మొత్తం రావడం గమనార్హం.బాహుబలి 2 చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 15న ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









