సెప్టెంబర్లో పట్టాలెక్కనున్న వేగవంతమైన రైలు

- August 08, 2016 , by Maagulf
సెప్టెంబర్లో పట్టాలెక్కనున్న వేగవంతమైన రైలు

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. సెప్టెంబర్‌లో ఈ రైలును ప్రారంభించనున్నట్లు చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. జెంగ్‌జౌ-షుజౌ మధ్య ఈ రైలు నడవనుంది.
బుల్లెట్‌ రైలు వేగాన్ని మించి.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును చైనా రూపొందించిన విషయం తెలిసిందే. గంటకు 380 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. సాధారణంగా జెంగ్‌జౌ నుంచి షుజౌ వెళ్లడానికి 2.33 గంటల సమయంల పడుతుంది. అయితే ఈ హైస్పీడ్‌ రైల్లో వెళితే 80 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చట. ఈ రైలు రాకపోకల కోసం ప్రత్యేక రైల్వే ట్రాక్‌ను కూడా నిర్మించింది చైనా ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com