త్వరలో ముంబైలో 1200 వైఫై హాట్స్పాట్లు
- August 08, 2016
ముంబయి నగరానికి 2017 మే లోగా 1,200ల వైఫై హాట్స్పాట్లు రానున్నాయి. ముంబయిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ తెలిపారు. అసెంబ్లీ పమావేశాల్లో పట్టణాభిహవృద్ధి విషయమై మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబయి నగరాన్ని స్మార్ట్గా మలచడానికి గతంలో సీసీటీవీ ప్రాజెక్టును ప్రవేశ పెట్టగా, ఇప్పుడు ఇది రెండో కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు.
2017 మే లోగా మంబయిలోని పలు ప్రాంతాల్లో ఈ హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 1200ల వైఫై హాట్స్పాట్లలో మొదటి విడతగా 2016 నవంబర్కల్లా 500 హాట్స్పాట్లు పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర విషయాలపై మాట్లాడుతూ.. మురికి నీరు సముద్రంలో కలవకుండా మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తగిన చర్యలు చేపడుతున్నట్లు, చెత్తను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సబ్అర్బన్ ప్రాంతాలను కూడా మరింత మెరుగైన, నివాసయోగ్యమైన ప్రాంతాలుగా మలచాలనుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









