పుష్కరాల తరువాత మంత్రివర్గంలోకి లోకేష్
- August 08, 2016
నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని తపిస్తోన్న టిడిపి నేతలకు శుభవార్త. అతిత్వరలోనే చినబాబు ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాలు ముగిసిన వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగబోతోందని సమాచారం. దీనిలో లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపి లోకి వచ్చిన కొందరు నేతలను కూడా మంత్రిపదవులు వరించే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అన్న విషయమై అటు ఇటుగా ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వ్యవహారాలు చూస్తూవచ్చిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారన్నమాట.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







