త్వరలో ముంబైలో 1200 వైఫై హాట్స్పాట్లు
- August 08, 2016
ముంబయి నగరానికి 2017 మే లోగా 1,200ల వైఫై హాట్స్పాట్లు రానున్నాయి. ముంబయిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ తెలిపారు. అసెంబ్లీ పమావేశాల్లో పట్టణాభిహవృద్ధి విషయమై మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబయి నగరాన్ని స్మార్ట్గా మలచడానికి గతంలో సీసీటీవీ ప్రాజెక్టును ప్రవేశ పెట్టగా, ఇప్పుడు ఇది రెండో కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు.
2017 మే లోగా మంబయిలోని పలు ప్రాంతాల్లో ఈ హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 1200ల వైఫై హాట్స్పాట్లలో మొదటి విడతగా 2016 నవంబర్కల్లా 500 హాట్స్పాట్లు పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర విషయాలపై మాట్లాడుతూ.. మురికి నీరు సముద్రంలో కలవకుండా మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తగిన చర్యలు చేపడుతున్నట్లు, చెత్తను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సబ్అర్బన్ ప్రాంతాలను కూడా మరింత మెరుగైన, నివాసయోగ్యమైన ప్రాంతాలుగా మలచాలనుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









