ఈద్ అల్ అదా..యూఏఈలో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..!!
- May 25, 2026
యూఏఈః ఈద్ అల్ అదా సెలవులలో యూఏఈలో అత్యంత వేడిగా, తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో వేడిగా ఉంటాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. మే 25 నుండి మే 31 వరకు, రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున వాతావరణ పరిస్థితులు సాధారణంగాఉంటాయని NCM తెలిపింది. అలాగే, వాతావరణం సాధారణంగా నిర్మలంగా ఉండి, కొన్ని తూర్పు ప్రాంతాల్లో అప్పుడప్పుడు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో 35ºC నుండి 43ºC మధ్య, ఉన్నత ప్రాంతాల్లో 43ºC నుండి 48ºC మధ్య, పర్వత ప్రాంతాల్లో 28ºC నుండి 35ºC మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో 24ºC నుండి 32ºC మధ్య, ఉన్నత ప్రాంతాల్లో 19ºC నుండి 27ºC మధ్య, పర్వత ప్రాంతాల్లో 24ºC నుండి 30ºC మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా.ఈ సందర్భంగా పగటిపూట నేరుగా సూర్యరశ్మికి గురికాకుండా ఉండాలని NCM ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







