ఈద్ అల్ అదా..యూఏఈలో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..!!
- May 25, 2026
యూఏఈః ఈద్ అల్ అదా సెలవులలో యూఏఈలో అత్యంత వేడిగా, తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో వేడిగా ఉంటాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. మే 25 నుండి మే 31 వరకు, రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున వాతావరణ పరిస్థితులు సాధారణంగాఉంటాయని NCM తెలిపింది. అలాగే, వాతావరణం సాధారణంగా నిర్మలంగా ఉండి, కొన్ని తూర్పు ప్రాంతాల్లో అప్పుడప్పుడు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో 35ºC నుండి 43ºC మధ్య, ఉన్నత ప్రాంతాల్లో 43ºC నుండి 48ºC మధ్య, పర్వత ప్రాంతాల్లో 28ºC నుండి 35ºC మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో 24ºC నుండి 32ºC మధ్య, ఉన్నత ప్రాంతాల్లో 19ºC నుండి 27ºC మధ్య, పర్వత ప్రాంతాల్లో 24ºC నుండి 30ºC మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా.ఈ సందర్భంగా పగటిపూట నేరుగా సూర్యరశ్మికి గురికాకుండా ఉండాలని NCM ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







