డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- May 26, 2026
ఆఫీస్ నిర్వహణ, ఫైళ్ల వ్యవస్థ పై కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని అంతస్తులు, విభాగాలను దాదాపు మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ఆఫీస్ మెయింటెనెన్స్ మరియు ఫైళ్ల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
కార్యాలయం మొత్తం ఒకే తరహా ఆకర్షణీయ రూపంలో కనిపించేలా గోడలు, టేబుళ్లు, అల్మారాలకు పెయింటింగ్ పనులు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. అలాగే కాన్ఫరెన్స్ హాళ్లు, ట్రైనింగ్ హాళ్లను ఆధునిక సౌకర్యాలతో మరింత మెరుగ్గా రీడిజైన్ చేయాలని సూచించారు.
విభాగాల వారీగా జరుగుతున్న పనితీరు, పరిపాలనా వ్యవస్థ, కార్యాలయ నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ, కార్యాలయ వాతావరణం సిబ్బందికి అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, వి.వి. శ్రీనివాసరావు, చారు సిన్హా తదితరులు పాల్గొన్నారు. తమ తమ శాఖల పనితీరు, అమలవుతున్న కార్యక్రమాల వివరాలను డీజీపీకి వివరించారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







