డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- May 26, 2026
ఆఫీస్ నిర్వహణ, ఫైళ్ల వ్యవస్థ పై కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని అంతస్తులు, విభాగాలను దాదాపు మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ఆఫీస్ మెయింటెనెన్స్ మరియు ఫైళ్ల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
కార్యాలయం మొత్తం ఒకే తరహా ఆకర్షణీయ రూపంలో కనిపించేలా గోడలు, టేబుళ్లు, అల్మారాలకు పెయింటింగ్ పనులు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. అలాగే కాన్ఫరెన్స్ హాళ్లు, ట్రైనింగ్ హాళ్లను ఆధునిక సౌకర్యాలతో మరింత మెరుగ్గా రీడిజైన్ చేయాలని సూచించారు.
విభాగాల వారీగా జరుగుతున్న పనితీరు, పరిపాలనా వ్యవస్థ, కార్యాలయ నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ, కార్యాలయ వాతావరణం సిబ్బందికి అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, వి.వి. శ్రీనివాసరావు, చారు సిన్హా తదితరులు పాల్గొన్నారు. తమ తమ శాఖల పనితీరు, అమలవుతున్న కార్యక్రమాల వివరాలను డీజీపీకి వివరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







