హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!

- May 26, 2026 , by Maagulf
హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!

రియాద్: బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసెమ్ చేసిన బాధ్యతారహితమైన ప్రకటనలను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి తీవ్రంగా ఖండించారు. తమ దేశానికి వ్యతిరేకంగా నేరాలు చేసి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో కలిసి గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నట్లు రుజువైన వ్యక్తులపై బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఖాసెమ్ ప్రకటన జారీ చేయడాన్ని తప్పబట్టారు. సదరు వ్యక్తులు బహ్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలు చేపట్టారని, దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నినట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు.

2016లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం.. హిజ్బుల్లాతోపాటు ఆ సంస్థ నాయకులు, అనుబంధ సంస్థలను జిసిసి సభ్య దేశాలు ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాయని అల్బుడైవి ధృవీకరించారు.  లెబనీస్ రిపబ్లిక్ మరియు దాని ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అన్ని పద్ధతులను జిసిసి నిస్సందేహంగా తిరస్కరిస్తుందని అల్బుడైవి చెప్పారు. లెబనాన్‌ చట్టబద్ధమైన సంస్థలను బలహీనపరిచే ఏ ప్రయత్నాలైనా ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ నాయకత్వంలో లెబనాన్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలకు, అలాగే ప్రధానమంత్రి నవాఫ్ సలాం నాయకత్వంలో లెబనీస్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన సంస్కరణల కార్యక్రమాలకు జీసీసీ మద్దతు ఇస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com