హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- May 26, 2026
రియాద్: బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లెబనాన్కు చెందిన హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసెమ్ చేసిన బాధ్యతారహితమైన ప్రకటనలను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి తీవ్రంగా ఖండించారు. తమ దేశానికి వ్యతిరేకంగా నేరాలు చేసి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో కలిసి గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నట్లు రుజువైన వ్యక్తులపై బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఖాసెమ్ ప్రకటన జారీ చేయడాన్ని తప్పబట్టారు. సదరు వ్యక్తులు బహ్రెయిన్కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలు చేపట్టారని, దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నినట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు.
2016లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం.. హిజ్బుల్లాతోపాటు ఆ సంస్థ నాయకులు, అనుబంధ సంస్థలను జిసిసి సభ్య దేశాలు ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాయని అల్బుడైవి ధృవీకరించారు. లెబనీస్ రిపబ్లిక్ మరియు దాని ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అన్ని పద్ధతులను జిసిసి నిస్సందేహంగా తిరస్కరిస్తుందని అల్బుడైవి చెప్పారు. లెబనాన్ చట్టబద్ధమైన సంస్థలను బలహీనపరిచే ఏ ప్రయత్నాలైనా ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ నాయకత్వంలో లెబనాన్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలకు, అలాగే ప్రధానమంత్రి నవాఫ్ సలాం నాయకత్వంలో లెబనీస్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన సంస్కరణల కార్యక్రమాలకు జీసీసీ మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







