ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- May 27, 2026
కువైట్ః నకిలీ ప్రయాణ వెబ్సైట్లు మరియు ఆన్లైన్ మోసాలకు ఉపయోగపడే ఆకర్షణీయమైన ఆఫర్ల బారిన పడకుండా ప్రయాణికులను జాతీయ సైబర్ సెక్యూరిటీ కేంద్రం హెచ్చరించింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలని, అధికారిక మరియు విశ్వసనీయ ప్లాట్ఫారమ్ల ద్వారా మాత్రమే బుకింగ్లు చేసుకునేలా చూసుకోవాలని ఈ కేంద్రం కోరింది. ఈ మేరకు తన X ఖాతాలో ఒక ప్రకటన షేర్ చేసింది. మోసగాళ్లు సెలవుల సమయంలో ఆకర్షణీయమైన విమాన ప్రయాణ ఆఫర్లను ప్రచారం చేస్తారు. ఇవి తరచుగా వినియోగదారులను మోసం చేసి, వారిని నమ్మదగని వెబ్సైట్లకు మళ్లించేలా రూపొందించబడతాయని అని తెలిపింది. వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!









