బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- May 27, 2026
అమరావతి: బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో గవర్నర్ మాట్లాడుతూ, ఇస్లాం మతంలో బక్రీద్ పర్వదినానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. విధేయత, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఈ పండుగను అత్యంత భక్తితో జరుపుకుంటారని పేర్కొన్నారు.
బక్రీద్ త్యాగానికి, సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల సంపూర్ణ భక్తికి, పేదల పట్ల కరుణకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తెలిపారు. దానధర్మాలు చేస్తూ అందరితో కలిసి పంచుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తోందన్నారు.
ఈ పవిత్ర సందర్భంగా సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం, సద్భావన మరింత పెంపొందాలని గవర్నర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







