బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

- May 27, 2026 , by Maagulf
బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

అమరావతి: బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో గవర్నర్ మాట్లాడుతూ, ఇస్లాం మతంలో బక్రీద్ పర్వదినానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. విధేయత, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఈ పండుగను అత్యంత భక్తితో జరుపుకుంటారని పేర్కొన్నారు.

బక్రీద్ త్యాగానికి, సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల సంపూర్ణ భక్తికి, పేదల పట్ల కరుణకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తెలిపారు. దానధర్మాలు చేస్తూ అందరితో కలిసి పంచుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తోందన్నారు.

ఈ పవిత్ర సందర్భంగా సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం, సద్భావన మరింత పెంపొందాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com