బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- May 27, 2026
అమరావతి: బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో గవర్నర్ మాట్లాడుతూ, ఇస్లాం మతంలో బక్రీద్ పర్వదినానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. విధేయత, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఈ పండుగను అత్యంత భక్తితో జరుపుకుంటారని పేర్కొన్నారు.
బక్రీద్ త్యాగానికి, సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల సంపూర్ణ భక్తికి, పేదల పట్ల కరుణకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తెలిపారు. దానధర్మాలు చేస్తూ అందరితో కలిసి పంచుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తోందన్నారు.
ఈ పవిత్ర సందర్భంగా సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం, సద్భావన మరింత పెంపొందాలని గవర్నర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..







