మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- May 27, 2026
మనామా: ఈద్ అల్-అధా సందడితో మనామా సూక్లో కొనుగోలుదారుల సందడి పెరిగింది. ఇటీవల మార్కెట్కు వచ్చే వారి సంఖ్య పెరగడం, కొనుగోలుదారుల ఆసక్తితో మార్కెట్ తిరిగి జీవం పోసుకుందని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు.
సాంప్రదాయకంగా ఈద్ సీజన్ అమ్మకాలకు అత్యంత కీలకమైన సమయమని బంగారు వ్యాపారి జయ్ రాథోడ్ తెలిపారు. ఈ ఏడాది కూడా వినియోగదారుల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రాంతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు తిరిగి రావడం కూడా వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడటానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో బంగారం దరలు కాస్తా తగ్గడం కూడా కలిసి వచ్చిందన్నారు.
సాధారణంగా బహ్రెయిన్ బంగారు డిజైన్లను కోరుకునే కువైట్ మరియు ఖతార్ వంటి పొరుగు దేశాల నుండి వచ్చే కస్టమర్ల తాకిడి మితంగానే ఉందని, అయితే ఈద్ సమయంలో వారి సంఖ్య క్రమంగా పెరిగిందని మరో నగల వ్యాపారి కునాల్ రమేష్ తెలిపారు.
మొత్తం మీద ప్రస్తుత ఈద్ కాలాన్ని మనామా సూక్కు స్వాగతించదగిన ప్రోత్సాహంగా వ్యాపారులు అభివర్ణిస్తున్నారు. ఈద్ పండుగ కొత్త ఉత్సాహాన్ని, బలమైన అమ్మకాలను మరియు బంగారు మార్కెట్కు సానుకూల దృక్పథాన్ని తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







