మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- May 27, 2026
మనామా: ఈద్ అల్-అధా సందడితో మనామా సూక్లో కొనుగోలుదారుల సందడి పెరిగింది. ఇటీవల మార్కెట్కు వచ్చే వారి సంఖ్య పెరగడం, కొనుగోలుదారుల ఆసక్తితో మార్కెట్ తిరిగి జీవం పోసుకుందని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు.
సాంప్రదాయకంగా ఈద్ సీజన్ అమ్మకాలకు అత్యంత కీలకమైన సమయమని బంగారు వ్యాపారి జయ్ రాథోడ్ తెలిపారు. ఈ ఏడాది కూడా వినియోగదారుల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రాంతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు తిరిగి రావడం కూడా వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడటానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో బంగారం దరలు కాస్తా తగ్గడం కూడా కలిసి వచ్చిందన్నారు.
సాధారణంగా బహ్రెయిన్ బంగారు డిజైన్లను కోరుకునే కువైట్ మరియు ఖతార్ వంటి పొరుగు దేశాల నుండి వచ్చే కస్టమర్ల తాకిడి మితంగానే ఉందని, అయితే ఈద్ సమయంలో వారి సంఖ్య క్రమంగా పెరిగిందని మరో నగల వ్యాపారి కునాల్ రమేష్ తెలిపారు.
మొత్తం మీద ప్రస్తుత ఈద్ కాలాన్ని మనామా సూక్కు స్వాగతించదగిన ప్రోత్సాహంగా వ్యాపారులు అభివర్ణిస్తున్నారు. ఈద్ పండుగ కొత్త ఉత్సాహాన్ని, బలమైన అమ్మకాలను మరియు బంగారు మార్కెట్కు సానుకూల దృక్పథాన్ని తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







