పీవీపీకి మహేష్ మాటిచ్చాడు
- August 08, 2016
బ్రహ్మోత్సవంతో పీవీపీ సినిమా సంస్థకి బొప్పి కట్టిన సంగతి తెలిసిన విషయమే. రూ.70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆ సినిమాకి పట్టుమని పాతిక కోట్లు కూడా రాలేదు. ఆ సినిమా తీసిన వీవీపీనే కాదు, భారీ రేట్లకు కొన్న బయ్యర్లూ పూర్తిగా నష్టపోయారు. ఆ సమయంలోనే ఆ సంస్థలో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు మహేష్. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకొన్నాడు. పీపీవీ లో మహేష్ మరో సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. దీనికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. రేపు (మంగళవారం) మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ తో కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది పీవీపీ. 2017 ఏప్రిల్లో ఈ సినిమా మొదలెడతారట. 2018లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కోసం మహేష్ పారితోషికంలో రిబేటు కూడా ఇచ్చాడని తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయమని, తద్వారా బ్రహ్మోత్సవం నష్టాన్ని పూడ్చుకోవొచ్చని మహేష్ సలహా ఇచ్చాడట. నష్టపోయిన నిర్మాతని ఈ విధంగా ఆదుకోవడం కూడా గొప్పే. అందుకే మహేష్ని చూసి అభిమానులే కాదు.. పీవీపీ సంస్థ కూడా పొంగిపోతోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







