ఉత్తర ప్రదేశ్‌లో యాంటీ టెర్రరిజం కోర్సు!

- August 09, 2016 , by Maagulf
ఉత్తర ప్రదేశ్‌లో యాంటీ టెర్రరిజం కోర్సు!

ఉత్తర ప్రదేశ్‌లోని ఓ మదర్సా సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ ఇవ్వబోతోంది. ఇది రెండేళ్ళ కాల పరిమితిగల కోర్సు. దర్గా ఏ అలా హజ్రత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సున్నియత్ జామియా రజ్వియా మంజర్ ఏ ఇస్లామ్‌లో దీనిని ప్రవేశపెడుతున్నారు. ఉగ్రవాదులు మత గ్రంథాలను తమ కుట్రలకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నదీ ఈ కోర్సులో చేరిన ముస్లింలకు తెలియజేస్తారు. ఉగ్రవాద సంస్థల నేపథ్యాన్ని, అమాయకులను తప్పుదోవ పట్టించడానికి అవి చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరిస్తారు. మన దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి తెలియజేస్తారు. దర్గా ఏ అలా హజ్రత్ అధికార ప్రతినిధి, హెడ్ కన్వీనర్ ముఫ్తి సలీం నూరి మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ పాపపు పనులను సమర్థించుకునేందుకు మత గ్రంథాలను దుర్వినియోగపరుస్తున్నారన్నారు. దీనిని ఎదుర్కొనేందుకే ఈ కోర్సును ప్రారంభిస్తున్నామన్నారు. దీనికి యాంటీ టెర్రరిజం కోర్సు అని పేరు పెట్టినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com