షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- June 02, 2026
యూఏఈ: షార్జా లోని ఒక రెసిడెన్సీ టవర్లోని మెట్లపై నుంచి పడి మరణించిన రెండేళ్ల బాలుడి మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై షార్జా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న నివాసితులు మరియు ప్రాపర్టీ మేనేజర్లు ఎత్తైన భవనాలలో పిల్లల భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. ఈ ఘటన క్షణాల్లో జరిగిపోయిన ఒక ఘోర విషాదమని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతి చెందిన బాలుడు పాకిస్తానీ కుటుంబానికి చెందిన వాడిగా గుర్తించారు. చనిపోవడానికి ముందు ఆ బాలుడు అపార్ట్మెంట్ బయటకు వెళ్లి, భవనంలోని పై అంతస్తులో ఉన్న మెట్ల ప్రాంతం దగ్గర ఆడుకుంటుండగా ఒక సందులోంచి కింద పడిపోయాడు. అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే గాయాలతో ఆ బాలుడు మరణించాడు. ఈ ప్రమాదం చాలా తక్కువ సమయంలో జరిగిందని, నివాస స్థలాల్లో చిన్న పిల్లలు ఎంత వేగంగా అసురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురవుతారో ఈ సంఘటన తెలియజేస్తోందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, బాలల సంరక్షణ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







