షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- June 02, 2026
యూఏఈ: షార్జా లోని ఒక రెసిడెన్సీ టవర్లోని మెట్లపై నుంచి పడి మరణించిన రెండేళ్ల బాలుడి మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై షార్జా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న నివాసితులు మరియు ప్రాపర్టీ మేనేజర్లు ఎత్తైన భవనాలలో పిల్లల భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. ఈ ఘటన క్షణాల్లో జరిగిపోయిన ఒక ఘోర విషాదమని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతి చెందిన బాలుడు పాకిస్తానీ కుటుంబానికి చెందిన వాడిగా గుర్తించారు. చనిపోవడానికి ముందు ఆ బాలుడు అపార్ట్మెంట్ బయటకు వెళ్లి, భవనంలోని పై అంతస్తులో ఉన్న మెట్ల ప్రాంతం దగ్గర ఆడుకుంటుండగా ఒక సందులోంచి కింద పడిపోయాడు. అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే గాయాలతో ఆ బాలుడు మరణించాడు. ఈ ప్రమాదం చాలా తక్కువ సమయంలో జరిగిందని, నివాస స్థలాల్లో చిన్న పిల్లలు ఎంత వేగంగా అసురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురవుతారో ఈ సంఘటన తెలియజేస్తోందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, బాలల సంరక్షణ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు









