బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!

- June 03, 2026 , by Maagulf
బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!

మనామా: ఒక పేషంట్  బ్రెయిన్ ట్యూమర్ ని నిర్ధారించడంలో ఆరు వారాల ఆలస్యానికి కారణమైన ఒక న్యూరాలజీ కన్సల్టెంట్‌కు విధించిన BD200 జరిమానాను కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది.

ఆ రోగి వాంతులు, తలనొప్పితో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారని,  ఆ కన్సల్టెంట్ CT స్కాన్ లేదా MRI చేయమని కోరకుండా, ఆమె పరిస్థితిని నెక్ స్ట్రెయిన్ అని కొట్టిపారేశారని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఆరు వారాల తర్వాత, సెకండ్ డాక్టర్ స్కాన్‌లను ఆదేశించగా, అందులో ఒక పెద్ద క్యాన్సర్ ట్యూమర్ ఉన్నట్లు వెల్లడైందని, అప్పటికే ఆమె పరిస్థితి గణనీయంగా క్షీణించిందని, చివరికి ఆపరేషన్ కోసం ఆమెను విదేశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

వైద్య లోపాలపై సాంకేతిక కమిటీ చేసిన నిర్ధారణలను కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది. ఆ డాక్డర్ వృత్తిపరమైన తప్పిదానికి పాల్పడ్డాడని తీర్పు ఇచ్చింది. పేషంట్ పౌర పరిహార దావాను సివిల్ కోర్టుకు రిఫర్ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com