ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!

- June 03, 2026 , by Maagulf
ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!

దోహా: డిజిటల్ ప్రపంచంలో సమాచార గోప్యతకు డేటా వర్గీకరణ కీలకమని ఖతార్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ (NCSA) తెలిపింది. కంపెనీలు తమ డిజిటల్ ప్రాపర్టీలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు భద్రపరచడానికి మార్గనిర్దేశం చేసేందుకు,  యూనిఫైడ్ ఐదు-అంచెల డేటా క్లాసిఫికేషన్ విధానాన్ని ఆవిష్కరించింది. ఈ మేరకు తన అధికారిక ఛానల్స్ ద్వారా ఒక అవగాహన ఫ్రేమ్‌వర్క్‌ ను  విడుదల చేసింది.

సైబర్ ముప్పుల నుండి కార్పొరేట్ సంస్థలను మరియు సాధారణ పౌరులను రక్షించే సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు NCSA వివరించింది.  ఈ జాతీయ భద్రతా ఫ్రేమ్‌వర్క్ 'లెవెల్ C0'తో ప్రారంభమవుతుందని, ఇది పబ్లిక్ డేటాను నియంత్రిస్తుందని పేర్కొంది. ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే మరియు స్పష్టంగా సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకున్న మొత్తం సమాచారాన్ని కవర్ చేస్తుందన్నారు. ఓపెన్ డేటాకు తక్కువ కఠినమైన యాక్సెస్ నియంత్రణలు అవసరమైనప్పటికీ, దానిని సరిగ్గా గుర్తించడం ద్వారా సంస్థలు ప్రమాదవశాత్తు సున్నితత్వం లేని సమాచారాన్ని అతిగా భద్రపరచకుండా నిరోధించవచ్చని, ఇది ప్రభుత్వ రంగాలలో కార్యాచరణ సరళతను మరియు పారదర్శకతను కాపాడుతుందని పేర్కొన్నది.  

దీని తర్వాత వచ్చే ‘లెవెల్ C1’ అంతర్గత డేటా ఉంటుందని, ఇందులో రోజువారీ అంతర్గత ఇమెయిల్‌లు, కంపెనీ మెమోలు మరియు ప్రాథమిక సంస్థాగత రికార్డులు కార్యాలయ పరిధి వెలుపల లీక్ కాకుండా చూసుకోవచ్చన్నారు.  మరింత సున్నితమైన కార్పొరేట్ సమాచారం కోసం, ఏజెన్సీ ‘లెవెల్ C2’ని ఏర్పాటు చేసిందని, సంస్థలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుందన్నారు. అనుమతి ఉన్న సిబ్బంది మాత్రమే వీటిని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందన్నారు.  

ఇదిలా ఉండగా, సున్నితమైన కార్పొరేట్ ఎకోసిస్టమ్ వేరియబుల్స్ కోసం ‘లెవెల్ C3’ ఆవిష్కరించారు. ఈ స్థాయిలో ప్రత్యేకంగా యాజమాన్య హక్కులు గల కస్టమర్ లేదా కార్పొరేట్ వ్యాపార డేటా ఉంటుందని NCSA తెలిపింది.  ఈ సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేస్తే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు మరియు ప్రతిష్టకు శాశ్వత నష్టం వాటిల్లవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. 

ఇక జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ లో అత్యున్నత మరియు అత్యంత సురక్షితమైన ‘లెవెల్ C4’ ఉంటుందని,  ఇది అత్యంత రహస్య డేటాను సూచిస్తుందన్నారు. ఈ స్థాయి అత్యంత ప్రాముఖ్యత కలిగిన, అత్యంత గోప్యమైన సమాచారాన్ని రక్షిస్తుందని పేర్కొన్నది.  ఈ అత్యున్నత డేటా నియమిత వర్గాలకే యాక్సెస్ ఉంటుందన్నారు.  ఈ క్లాసిఫికేషన్ ద్వారా ఖతార్ సంస్థలు తమ డేటా ప్రాపర్టీల ప్రమాద విలువను ఖచ్చితంగా అంచనా వేయగలవని, అధునాతన ఆధునిక సైబర్ దాడుల నుండి దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడానికి అవసరమైన కచ్చితమైన సాంకేతిక భద్రతా చర్యలను అమలు చేయగలవని ఖతార్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ తన అవగాహన ప్రకటనలో తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com