కృష్ణా పుష్కరాలలో ప్రతిరోజు ఉచిత భోజనాలు

- August 09, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలలో ప్రతిరోజు  ఉచిత భోజనాలు

పులిచింతల నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రేపు సాయంత్రానికి బ్యారేజీ దగ్గర 12 అడుగులకు నీటిమట్టం చేరనుంది. పుష్కరఘాట్లలో నాలుగు అడుగుల మేర నీరు ఉంటుందని ప్రత్యేక అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రతి ఘాట్ దగ్గర డిప్యూటీ కలెక్టర్ బృందం ఉంటుందని రాజశేఖర్‌ తెలిపారు. కృష్ణా, గుంటూరు, కర్నూలులో మొత్తం 170 ఘాట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పుష్కరాల విధుల్లో లక్ష మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. 35 వేల మంది పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాజశేఖర్ అన్నారు. ప్రతిరోజు 11 లక్షల మందికి ఉచిత భోజనాలు పెడతామని రాజశేఖర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com