దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!

- June 05, 2026 , by Maagulf
దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన తొమ్మిది మందిని ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్‌కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్ విభాగం అరెస్టు చేసింది. వీరు ఆసియా దేశస్తులను,  దిబ్బా విలాయత్ తీరానికి చేపల వేట పడవలో వచ్చారని పేర్కొన్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరో సంఘటనలో, అల్ రుస్తాక్ ప్రాంతంలోని 'యాకా' పరిధిలో ఉన్న ఒక పర్వత ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఒక పౌరుడిని, రాయల్ ఒమన్ పోలీస్ వైమానిక విభాగం (Air Wing) అత్యవసర వైద్య తరలింపు ద్వారా రక్షించింది. ఆ పౌరుడిని సదరు విలాయత్‌లోని రుస్తాక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com