'సామి 2' సినిమా వీలైనంత త్వరగా సెట్స్పైకి ..
- August 09, 2016
సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేసే నటుడు విక్రం. తాజాగా ఆయన నటించిన 'ఇరుముగన్' ట్రైలర్ను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సైన్స్ ఫిక్షన్ కథతో దీన్ని రూపొందించారు. నయనతార, నిత్యామేనన్ కథానాయికలు. ఈ సినిమా తర్వాత నటుడు విక్రం 'గరుడ' సినిమాలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే 'ఇరుముగన్' ఆడియో విడుదల సమయంలో 'సామి 2' సినిమా గురించి ప్రకటించారు. విక్రం నటించిన 'సామి' చిత్రం బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తమ అభిమాన హీరోను మళ్లీ పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో చూడటానికి ఉత్సుకత చూపుతున్నారు. అంతేకాక 'గరుడ' సినిమా కొన్ని కారణాలతో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. అందుకే హరి దర్శకత్వంలోని 'సామి 2' సినిమాను వీలైనంత త్వరగా సెట్స్పైకి తీసుకెళ్లాలని విక్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







