తెలంగాణ: R&B శాఖలో సంచలనం రేపిన ఏసీబీ దాడులు
- June 09, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖలో అత్యున్నత అధికారి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీగా విధులు నిర్వహిస్తున్న మోహన్ నాయక్ ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు ఉదయం నుంచి విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్తో పాటు స్వగ్రామంలోనూ తనిఖీలు
హైదరాబాద్ నగరంలోని మోహన్ నాయక్ ప్రధాన నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మోపాల్ మండలం కులాస్ పూర్ తండాలోనూ ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. కులాస్పూర్ తండాలోని మోహన్ నాయక్కు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్లోనూ అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
మోహన్ నాయక్ సొంత ఇళ్లే కాకుండా, ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువుల నివాసాలను కూడా ఏసీబీ వదల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లోని అతని బంధువుల నివాసాల్లో ఉదయం నుంచే ఏకకాలంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. కీలక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పట్టుబడిన నగదు, ఆస్తుల విలువ ఎంత అనేది సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







