ఐఐఐటీ జంక్షన్–డీఎల్ఎఫ్ కారిడార్ అభివృద్ధి పనులను పరిశీలించిన సైబరాబాద్ సీపీ
- June 09, 2026
హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద కొనసాగుతున్న రహదారి అభివృద్ధి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి డీఎల్ఎఫ్ జంక్షన్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం, రహదారి విస్తరణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.
శేర్లింగంపల్లి ఏడీసీపీ హనుమంతరావు, సిఎంసి (CMC) అధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన సీపీ, పనులు నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, నిర్మాణ పనుల నేపథ్యంలో రాబోయే మూడు నెలల పాటు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ అమలు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను సులభతరం చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.
ఫ్లైఓవర్ నిర్మాణం, రహదారి అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత గచ్చిబౌలి–డీఎల్ఎఫ్ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్హెచ్ఓ సురేష్, సిఎంసి అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు
- షార్జా–మస్కట్ రూట్లో అదనపు సర్వీసులు









